Thursday, April 7, 2011

ఎందరు ఎన్ని రాగాలు పలికినా సరే..మనసు గాయం తీరేది కాదు






వెన్నెల కుప్పలాడుకునే
అమ్మాయిల మదిని దోచుకునే చందమామ..
పారిజాత పుష్పాలను ఏరుకునేటప్పుడు
గాలి రేపే మలయ పరిమళం.

అపార్థం, అపనమ్మకం తోడయితే..
వెయ్యి ఆశలు కుప్పగూలితే
సముద్రపు రెల్లుదిబ్బపై
రెపరెపలాడే గడ్డిపోచలు గుర్తొస్తాయి

ఎందరు ఎన్ని రాగాలు పలికినా సరే
ఎందరు ఎన్ని గుండెకోతలు కోసినా సరే...
మనసు గాయం తీరేది కాదు.